ముఖం చూసి బీపీ, షుగర్ లెక్కలు చెప్పేస్తుంది

అన్నిరంగాల్లోనూ సాంకేతికత రోజురోజుకీ పెరిగిపోతుంది. వైద్య రంగంలోనూ సాంకేతికత బాగా అభివృద్ధి చెందుతోంది. ఎటువంటి గాట్లు లేకుండానే రకరకాల ఆపరేషన్లు కూడా చేసే అత్యాధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాధి నిర్ధారణ చేయగలిగే సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. థర్మల్‌ స్క్రీనింగ్‌ డివైజ్‌ పరికరంతో రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను సులువుగా గుర్తించవచ్చని ప్రముఖ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ఆర్కా ల్యాబ్‌ సీఈవో గాయత్రి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డివైజ్‌ తయారీ, వీటి వినియోగానికి అవసరమైన సాంకేతికతను బెంగళూరు కేంద్రంగా అందిస్తున్నట్టు చెప్పారు.

నిల్చున్న చోటే ముఖ కదలికలను కెమెరా రికార్డు చేసి వాటిని ఎనలైజ్‌ చేసేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ సాయంతో బీపీ, షుగర్‌, గుండె సంబంధిత వ్యాధులను గుర్తించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్‌తోపాటు మరికొన్ని సెంటర్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు క్లినిక్‌ల ద్వారా ఈ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 4వేల మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా వైద్య పరీక్షలు చేయగా 91 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నూతన డివైజ్‌ ద్వారా రూ.100 నుండి రూ.150 లోపే హెల్త్‌ రిపోర్టు పొందవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *